Share News

యువతి ఆత్మహత్య

ABN , Publish Date - Jun 03 , 2024 | 12:10 AM

పట్టణంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్న చోడిపల్లి ఉష(19) ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, మృతురాలి స్నేహితులు తెలిపిన వివరాల ప్రకా రం.. సాలూరు మండలం ఖరాసువలస పంచాయతీ గడివలస గ్రామానికి చెందిన చోడిపల్లి ఉష గత ఆరు నెలలుగా పట్టణం లోని ఓ ప్రైవేటు హోటల్‌లో పనిమనిషిగా చేస్తోంది

యువతి ఆత్మహత్య

సాలూరు: పట్టణంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్న చోడిపల్లి ఉష(19) ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, మృతురాలి స్నేహితులు తెలిపిన వివరాల ప్రకా రం.. సాలూరు మండలం ఖరాసువలస పంచాయతీ గడివలస గ్రామానికి చెందిన చోడిపల్లి ఉష గత ఆరు నెలలుగా పట్టణం లోని ఓ ప్రైవేటు హోటల్‌లో పనిమనిషిగా చేస్తోంది. తనతో పాటు పనిచేస్తున్న మరియ, దివ్యలతో కలిసి పట్టణంలోని గొర్లెవీధిలో నివాసం ఉంటోంది. అయితే ఆదివారం ఇంటి నుంచి వచ్చిన ఉష.. ఉదయం హోటల్‌కు వెళ్లింది. మధ్యాహ్నం మూడు గంట ల సమయంలో తన తోటి పనిమనిషి అయిన మరియతో కలిసి రూంకు వెళ్లి పోయింది. ఇద్దరు విశ్రాంతి తీసుకున్నారు. మరియకు మెలుకువ రాగానే చూడ గా.. శ్లాబు హుక్కుకి చీర సహాయంతో ఊరివేసుకుని ఉష కనబడింది. భయ కంపితురాలైన మరియ వెంటనే ఇరుగు పొరుగువారికి వెళ్లి చెప్పింది. వారు పో లీసులకు, హోటల్‌ యజమానికి ఫోన్‌చేసి చెప్పటంతో ఘటనా స్థలానికి చేరుకు న్నారు. పట్టణ సీఐ వాసునాయుడు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఫ ఖరాసువలస పంచాయతీ గడివలస గ్రామానికి చెందిన చోడిపల్లి నారాయణ, విజయమ్మలకు ముగ్గురు ఆడపిల్లలు. వ్యవసాయ కూలీ అయిన నారాయణ ముగ్గురు ఆడపిల్లలను చదివించగా.. ఉష కేవలం తొమ్మిదో తరగతి వరకు చదువుకుని మధ్యలో బడి మానేసింది. కుటుంబానికి కొంత ఆసరాగా ఉండాలని ఇలా హోటల్‌లో పనిచేస్తుంది. ఆ రోజే ఇంటి నుంచి వచ్చిన ఉష ఇలా మృత్యువాత పడటం పట్ల హోటల్‌ యజమాని మధీనాతో పాటు తోటి పనివారు, బంధువులు, తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 03 , 2024 | 12:10 AM