వైసీపీని గద్దె దింపాలి: సంధ్యారాణి
ABN , Publish Date - May 03 , 2024 | 11:58 PM
ప్రతిఒక్కరూ ఓటుతో వైసీపీకి బుద్ధి చెప్పి గద్దె దింపాలని కూటమి సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మిడి సంధ్యా రాణి పిలుపునిచ్చారు.
![వైసీపీని గద్దె దింపాలి: సంధ్యారాణి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
పాచిపెంట: ప్రతిఒక్కరూ ఓటుతో వైసీపీకి బుద్ధి చెప్పి గద్దె దింపాలని కూటమి సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మిడి సంధ్యా రాణి పిలుపునిచ్చారు. మండలంలోని తోటవలస, కొటికిపెంట, కేసలి, గరెళ్లవలస, బడ్నాయికవలస, కర్రివలస, అమ్మవలస గ్రామాల్లో ఆమె శుక్రవారం ఇంటింటి ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షు డు పిన్నింటి ప్రసాద్బాబు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. సూపర్సిక్స్ పథకాలపై వివరించారు. ప్రచారంలో భాగంగా కొటికిపెంట గ్రామంలో వైసీపీకి చెందిన 200 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ మండల అధ్యక్షుడు పిన్నింటి ప్రసాద్బాబు ఆధ్వర్యంలో వారికి సంధ్యారాణి కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొత్తల పోలినాయుడు, ముఖి సూర్యనారాయణ దండి మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.