ఓటమి భయంతోనే వైసీపీ అరాచకాలు
ABN , Publish Date - May 27 , 2024 | 11:51 PM
ఓటమి భయంతోనే నిరాశ నిస్పృహతో వైసీపీ నాయకుల అరాచకాలు పెచ్చు మీరుతున్నాయని రాజాం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు ము రళీమోహన్ విమర్శించారు.
![ఓటమి భయంతోనే వైసీపీ అరాచకాలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
రాజాం: ఓటమి భయంతోనే నిరాశ నిస్పృహతో వైసీపీ నాయకుల అరాచకాలు పెచ్చు మీరుతున్నాయని రాజాం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు ము రళీమోహన్ విమర్శించారు. సోమవారం శ్యాంపురం క్యాంపు కార్యాలయంలో పార్టీ నా యకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వైసీ పీ ప్రభుత్వం ఐదేళ్ల పాలన లో రాష్ట్రంలోని ప్రజలు పూర్తిగా విసుగెత్తి పోయార న్నా రు. వైసీపీ అకృత్యాలకు భయపడకుండా రాష్ట్రంలో ప్రజలు 82 శాతానికిపైగా ఓటుహ క్కును వినియోగించుకున్నారన్నారు. కొద్ది రోజుల్లో కూటమి భారీ విజయం సాధించ బోతుందన్నారు. ఓడిపోతామన్న నిరాశ నిస్పృహలతో సహనం కోల్పోయిన వై సీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారన్నారు. పల్నాడు, తిరుపతి, చంద్రగిరి, నర సారా వుపేటతోపాటు పలు చోట్ల విధ్వంసం జరిగిన ఘటనలను తీవ్రంగా ఖండించా రు. అధికారులను బెదిరిస్తున్న నాయకులు నాలుగో తేదీ తర్వాత కనిపించరన్నారు.