Share News

గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి: జయకృష్ణ

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:28 AM

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పాలకొండ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని ఉమ్మడి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ కోరారు.

గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి: జయకృష్ణ

సీతంపేట: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పాలకొండ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని ఉమ్మడి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ కోరారు. గురువారం టీడీపీ మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వైసీపీ అరాచక పాలనపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ మండల అధ్యక్షులు సవర తోట ముఖలింగం, బిడ్డిక విశ్వనాఽథం, ఆరిక అమల, నాయకులు గర్భాన సత్తిబాబు, గేదెల చిరంజీవి, సవర జమ్మయ్య, టి.తేజోవతి, ఆర్‌.రంగనాథం, హిమరిక పవన్‌, గంట సుధ, తోయక సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. అలాగే భామిని, వీరఘట్టంలో కూడా జయకృష్ణ కూటమి నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు.

Updated Date - Apr 12 , 2024 | 12:28 AM