Share News

మహిళ ఆత్మహత్య

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:13 AM

మనస్తాపంతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండ లంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి సీఐ రవికుమార్‌ తెలిపిన వివరా లు ఇలా ఉన్నాయి.

మహిళ ఆత్మహత్య

భోగాపురం: మనస్తాపంతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండ లంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి సీఐ రవికుమార్‌ తెలిపిన వివరా లు ఇలా ఉన్నాయి. మండలంలోని ముంజేరు గ్రామానికి చెందిన పిడుగు శాంతమ్మ(55) భర్తతో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. వీరికి పిల్లలు లేరు. ఇటీవల శాంతమ్మకు ఆవు పొడవడంతో అనారోగ్యం పాల య్యింది. తాగుడుకు బానిసైన భర్త నిత్యం వేధిస్తుండడం, పిల్లలు లేరన్న బాధ, వీటికి అనారోగ్యం కూడా తోడవడంతో శాంతమ్మ జీవితంపై విరక్తి చెందింది. దీంతో మంగళవారం రాత్రి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డింది. దీనిని గమనించిన స్థానికులు విజయనగరం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై భర్త పిడుగు సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నామని ఏఎస్‌ఐ తవుడు తెలిపారు.

Updated Date - Mar 28 , 2024 | 12:13 AM