చంద్రబాబుతోనే ప్రాజెక్టులకు మహర్దశ
ABN , Publish Date - Mar 29 , 2024 | 12:17 AM
రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వస్తేనే సాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ వస్తుందని కూటమి నియోజకవర్గ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ అన్నారు.
రాజాం: రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వస్తేనే సాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ వస్తుందని కూటమి నియోజకవర్గ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ అన్నారు. గురువారం బుచ్చింపేట గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం చేపట్టారు. సూపర్ సిక్స్ పథకాలు, బీసీ డిక్లరేషన్ను ప్రజలకు వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఉద్యోగులందరికీ సకాలంలో వేతనాలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు నంది సూర్యప్రకాష్రావు, కిమిడి అశోక్ కుమార్, గురవాన నారాయణరావు, పొట్టా చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.