Share News

నెల్లిమర్ల అభివృద్ద్ధికి కృషి చేస్తా

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:12 AM

ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని కూటమి అభ్యర్థి లోకం మాధవి అన్నారు.

నెల్లిమర్ల అభివృద్ద్ధికి కృషి చేస్తా

నెల్లిమర్ల: ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని కూటమి అభ్యర్థి లోకం మాధవి అన్నారు. టీడీపీ నాయకుడు సువ్వాడ రవిశేఖర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఆమె బొడ్డపేట, వల్లూరు, మల్యాడ, ఒమ్మి గ్రామాల్లో ప్రచారం చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి, మండల అధ్యక్షుడు కడగల ఆనంద్‌కుమార్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పతివాడ తమ్మినాయుడు, గేదెల రాజారావు ప్రచారంలో పాల్గొన్నారు. కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరారు. పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 12:12 AM