Share News

అన్ని విధాలా చూసుకుంటా..

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:38 PM

నెల్లిమర్ల నియోజవర్గ టిక్కెట్‌ను జనసేన పార్టీకి కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, ఈ టిక్కెట్‌ను ఆశించిన కర్రోతు బంగారురాజు అధిష్ఠానం నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయ డంతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆయన్ను పిలిచారు.

 అన్ని విధాలా చూసుకుంటా..

- తొందర పడవద్దు

- కర్రోతుకు చంద్రబాబు హామీ

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

నెల్లిమర్ల నియోజవర్గ టిక్కెట్‌ను జనసేన పార్టీకి కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, ఈ టిక్కెట్‌ను ఆశించిన కర్రోతు బంగారురాజు అధిష్ఠానం నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయ డంతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆయన్ను పిలిచారు. మంగళవారం ఉండవల్లిలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబును కర్రోతు కలిశారు. అన్ని విధాలా చూసుకుంటానని, తొందర పడవద్దని చంద్రబాబు ఆయనకు హామీనిచ్చారు. నాలుగు రోజుల తరువాత మళ్లీ మాట్లాడుదామని చెప్పి పంపించారు. ఈ సందర్భంగా బంగారురాజు.. పార్టీకి చేసిన సేవలను చంద్రబాబుకు వివరించారు. కాగా, అసెంబ్లీ టిక్కెట్‌ దక్కకపోతే పార్లమెంట్‌ టిక్కెట్‌ అయినా దక్కుతుందన్న ఆశాభావంతో బంగారురాజు కేడర్‌ ఉంది. బంగారు రాజు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. చంద్రబాబును కలిసినట్లు వెల్లడించారు. తొందర పడవద్దని అధినేత చెప్పారని, నాలుగు రోజుల తరువాత మళ్లీ మాట్లాడుదామని తనకు చెప్పి పంపించారని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - Feb 27 , 2024 | 11:38 PM