Share News

అభివృద్ధికి ఓటు వేయండి: జగదీశ్వరి

ABN , Publish Date - May 03 , 2024 | 12:31 AM

అభివృద్ధికి, విధ్వంసానికి మధ్య జరుగుతున్న పోరులో ప్రతిఒక్కరూ అభివృద్ధికి ఓటు వేసి, గెలిపించాలని కూటమి కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి కోరారు.

అభివృద్ధికి ఓటు వేయండి: జగదీశ్వరి

కొమరాడ: అభివృద్ధికి, విధ్వంసానికి మధ్య జరుగుతున్న పోరులో ప్రతిఒక్కరూ అభివృద్ధికి ఓటు వేసి, గెలిపించాలని కూటమి కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి కోరారు. మండలంలోని ఇందిరానగరం, గాంధీనగరం, ఉలిపిరి, అల్లువాడ, చోళ్ళపధం, కొట్టు, తొడుము, దళాయిపేట గ్రామాల్లో టీడీపీ మండల కన్వీనర్‌ ఉదయశేఖర్‌ పాత్రుడు అధ్యక్షతన గురువారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ నాయకులు సుదర్శనరావు, వెంకటనాయుడు, మధుసూదనరావు, తమ్మయ్య, పద్మావతి, జనసేన మండల కన్వీనర్‌ శ్రీకర్‌, తదితరులు పాల్గొన్నారు. కొమరాడ పంచాయతీ కొత్తవలస వలంటీరుగా పనిచేస్తున్న కొండగొర్రి ప్రవీణ్‌కుమార్‌ టీడీపీ కండువా కప్పుకున్నారు. గురువారం కూటమి అభ్యర్థి తోయక జగదీశ్వరి ఆయనకు పార్టీ కండువా వేసి, ఆహ్వానించారు. టీడీపీ మండల కన్వీనర్‌ శేఖర్‌పాత్రుడు, సుదర్శనరావు, మధుసూదనరావు, డి.వెంకటనాయుడు, తదితరులు ఉన్నారు.

కురుపాం: కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి, ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతను గెలిపించాలని కోరుతూ ఉదయపురం పంచాయతీ పరిధిలో తెలుగు యువత అధికార ప్రతినిధి కోలా రంజిత్‌కమార్‌ ఆధ్వర్యంలో గురువారం ప్రచారం నిర్వహించారు. జీవీ రమణ మూర్తి, వెంపటాపు, సుబ్బలక్ష్మి, భారతి, తదితరులు పాల్గొన్నారు. కురుపాం పంచాయతీ కాటర్‌దొరవలస గ్రామానికి చెందిన పలు కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. గురువారం వీరిని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్‌ చంద్రదేవ్‌ పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కడ్రక మల్లేష్‌, జనసేన మండల కన్వీనర్‌ నేరుడబిల్లి వంశీ, టీడీపీ నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గరుగుబిల్లి: చిలకాం పంచాయతీ పరిధిలో టీడీపీ అరకు బీసీ సెల్‌ అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి సత్యనారాయణ ప్రచారం నిర్వహించారు. ఎం.పు రుషోత్తంనాయుడు, ఎం.తవిటినాయుడు, తవిటినాయుడు, ఎం.సింహాచలంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2024 | 12:31 AM