ప్రతి ఒక్కరూ ఓటేయండి
ABN , Publish Date - May 08 , 2024 | 11:09 PM
ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని జిల్లా సాధారణ పరిశీలకుడు తలాత్ పర్వజ్ ఇక్బాల్ రోహిల్లా కోరారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టరేట్ వద్ద చేపట్టిన బైక్ ర్యాలీని అసిస్టెంట్ కలెక్టర్ త్రివినాగ్తో కలిసి ప్రారంభించారు.
ప్రతి ఒక్కరూ ఓటేయండి
ఎన్నికల పరిశీలకుడు తలాత్ పర్వేజ్
విజయనగరంలో స్వీప్ బైక్ ర్యాలీ
కలెక్టరేట్, మే 8: ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని జిల్లా సాధారణ పరిశీలకుడు తలాత్ పర్వజ్ ఇక్బాల్ రోహిల్లా కోరారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టరేట్ వద్ద చేపట్టిన బైక్ ర్యాలీని అసిస్టెంట్ కలెక్టర్ త్రివినాగ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం స్వయంగా మోటర్ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు ప్రజాస్వామ్య మనుగడకు మూలాధారమన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ఈ మహా కత్రువులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చెప్పారు. ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని చర్యలూ తీసుకుం దన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించేకోవాలని చెప్పారు. ఈ నెల 13న మహిళలు, యువత ఓటర్లంతా ముందుకు వచ్చి ఓటు వేయాలని కోరారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, సీపీవో బాలాజీ, జిల్లా సైనిక్ సంక్షేమాధికారి డాక్టరు సత్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.