వ్యాను, ఆటో ఢీ
ABN , Publish Date - Apr 27 , 2024 | 12:00 AM
మినీ వ్యాను, ఆటో ఢీకొని ఒకరు గాయపడిన ఘటన మండలంలోని కవిరిపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది.
మక్కువ: మినీ వ్యాను, ఆటో ఢీకొని ఒకరు గాయపడిన ఘటన మండలంలోని కవిరిపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాలు ప్రకారం.. మక్కువ నుంచి శంబర వెళ్తున్న మినీ వ్యాను కవిరిపల్లి నుంచి మక్కువ వస్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో కవిరిపల్లి గ్రామానికి చెందిన గదిలి విశ్వనాథంకు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తు న్నట్టు ఎస్ఐ పి.నరసింహమూర్తి తెలిపారు.