రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Mar 28 , 2024 | 12:11 AM
మండలంలోని ఎస్ఆర్పేట వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించి స్థానికు లు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గుర్ల, మార్చి 27: మండలంలోని ఎస్ఆర్పేట వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించి స్థానికు లు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్ల నుంచి విజయనగరం వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న రమేష్, విజయనగరం నుంచి చీపురుపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న అప్పలనాయుడు ఎదురెదురుగా వస్తూ ఎస్ఆర్.పేట వద్ద బలంగా ఢీకొన్నారు. దీంతో ఇరువురికి తీవ్రగాయాలయ్యా యి. ఈ మేరకు ఇద్దరినీ 108 వాహనంపై విజయనగరం ఆసుపత్రికి తర లించారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ భాస్కరనాయుడు తెలిపారు.