Share News

విధ్వంసం తప్ప అభివృద్ధి లేదు

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:04 AM

నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదని టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌గజపతిరాజు అన్నారు.

 విధ్వంసం తప్ప అభివృద్ధి లేదు
మాట్లాడుతున్న టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు

- సైకో జగన్‌ను ఇంటికి పంపించండి

- ‘రా కదలిరా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

- టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు

విజయనగరం రూరల్‌, జనవరి 7: నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదని టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌గజపతిరాజు అన్నారు. విజయనగరం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం పార్టీ కార్యాలయం (అశోక్‌ బంగ్లా)లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్‌ గద్దె ఎక్కగానే విజయవాడలో ప్రజావేదికను కూల్చేసి రాష్ట్రంలో విధ్వంస పాలనకు శ్రీకారం చుట్టారని ఎద్దేవా చేశారు. విజయనగరం నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ద్వారపూడి వద్ద ఏర్పాటు చేసిన సోలార్‌ప్లాంట్‌ను కూడా ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. కూల్చివేతల వల్ల ప్రజాధనం వృథా అవుతుందని మండిపడ్డారు. ఇటువంటి సైకోని ఎంత వేగంగా ఇంటికి పంపిస్తే రాష్ట్రానికి అంత వేగంగా మేలు జరుగుతుంద న్నారు. ‘రా కదలిరా’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 10న బొబ్బిలిలో జరిగే చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ విజయనగరం నియోజకవర్గ ఇన్‌చార్జి అదితి గజపతిరాజు మాట్లాడుతూ.. సైకో జగన్‌ పాలనపై ప్రజలు విసిగిపోయి టీడీపీ వైపు చూస్తున్నారని తెలిపారు. బొబ్బిలిలో జరిగే ‘రా కదలిరా’ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 12:04 AM