చికిత్సపొందుతూ మహిళ మృతి
ABN , Publish Date - Feb 25 , 2024 | 12:26 AM
కొండదేవుపల్లి- కమ్మవలస రోడ్డులో ఈనెల 20నఆటో ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన పాకినవలస లక్ష్మి(30)చికిత్స పొందుతూ విజయన గరంలో శనివారం మృతిచెందింది. ఎస్ఐ చదలవాడ సత్యనారాయణ కథనం మేరకు..కమ్మవలస గ్రామానికి చెందిన లక్ష్మి భర్త తవిటినాయుడుతో ఈనెల 20న భీష్మాఏకాదశి పూజలకోసం కొండదేవుపల్లికి బైకుపైవెళ్లింది. తిరిగి స్వగ్రా మానికి వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొంది. ప్రమాదాన్ని గమనిం చిన లక్ష్మి ముందగానే బైకుపైనుంచి దూకడంతో ఆమె తీవ్రంగా గాయప డింది. దీంతో ఆమెను బొబ్బిలి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్సకోసం విజయనగరం తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. లక్ష్మి మృతిచెందడంతో భర్త తవిటినాయుడు కలత చెంది ఇంటి నుంచి ఎటోవెళ్లిపోయాడు. వారికి యశ్వంత్, జస్వంత్ ఇద్దరు కుమా రులు ఉన్నారు.ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదే హానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
![చికిత్సపొందుతూ మహిళ మృతి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
బొబ్బిలి: కొండదేవుపల్లి- కమ్మవలస రోడ్డులో ఈనెల 20నఆటో ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన పాకినవలస లక్ష్మి(30)చికిత్స పొందుతూ విజయన గరంలో శనివారం మృతిచెందింది. ఎస్ఐ చదలవాడ సత్యనారాయణ కథనం మేరకు..కమ్మవలస గ్రామానికి చెందిన లక్ష్మి భర్త తవిటినాయుడుతో ఈనెల 20న భీష్మాఏకాదశి పూజలకోసం కొండదేవుపల్లికి బైకుపైవెళ్లింది. తిరిగి స్వగ్రా మానికి వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొంది. ప్రమాదాన్ని గమనిం చిన లక్ష్మి ముందగానే బైకుపైనుంచి దూకడంతో ఆమె తీవ్రంగా గాయప డింది. దీంతో ఆమెను బొబ్బిలి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్సకోసం విజయనగరం తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. లక్ష్మి మృతిచెందడంతో భర్త తవిటినాయుడు కలత చెంది ఇంటి నుంచి ఎటోవెళ్లిపోయాడు. వారికి యశ్వంత్, జస్వంత్ ఇద్దరు కుమా రులు ఉన్నారు.ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదే హానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.