క్రీడా మైదానం కాదండోయ్..
ABN , Publish Date - Apr 05 , 2024 | 11:42 PM
ఈ ఫొటో చూసి క్రీడా మైదానం అనుకుంటే పొరబడినట్టే. ఇది సాలూరు మండలం అన్నంరాజువలస వద్ద చెరువు. నిత్యం జలకళతో నిండుగా ఉండే ఈ చెరువు ఈ ఏడాది తొలివారానికే పూర్తిగా ఎండిపోయింది.
![క్రీడా మైదానం కాదండోయ్..](https://media.andhrajyothy.com/media/2024/20240326/5_APRIL_SALUR_RURAL_27_60a8818642.gif)
ఈ ఫొటో చూసి క్రీడా మైదానం అనుకుంటే పొరబడినట్టే. ఇది సాలూరు మండలం అన్నంరాజువలస వద్ద చెరువు. నిత్యం జలకళతో నిండుగా ఉండే ఈ చెరువు ఈ ఏడాది తొలివారానికే పూర్తిగా ఎండిపోయింది. ఎండల తీవ్రతకు చుక్క నీరు కూడా పరిస్థితి. పూర్తిగా క్రీడా మైదానంగా మారిన ఈ చెరువు గర్భంలో ప్రస్తుతం ఆ గ్రామ యువత క్రికెట్ తదితర ఆటలాడుకుంటున్నారు. కానీ గ్రామస్థులు మాత్రం ఆవేదన చెందుతున్నారు. చెరువు ఎండిపోవడంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదంటూ వాపోతున్నారు.
- సాలూరు రూరల్