నామినేషన్ల పర్వం మొదలు
ABN , Publish Date - Apr 18 , 2024 | 11:34 PM
జిల్లాలో నామినేషన్ల పర్వం మొదలైంది. అయితే గురువారం తొలిరోజు టీడీపీతో పాటు వైసీపీ, ఇతర ప్రధాన పార్టీల అభ్యర్థులెవరూ నామినేషన్లు వేయలేదు. కురుపాంలో ఒక స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు.
మిగిలిన చోట్ల నిల్
పార్వతీపురం, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నామినేషన్ల పర్వం మొదలైంది. అయితే గురువారం తొలిరోజు టీడీపీతో పాటు వైసీపీ, ఇతర ప్రధాన పార్టీల అభ్యర్థులెవరూ నామినేషన్లు వేయలేదు. కురుపాంలో ఒక స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. అది మినహా జిల్లాలో మరెక్కడా నామినేషన్లు పడలేదు. చాలా మంది అభ్యర్థులు మంచి రోజు, జన్మ నక్షత్రం, పేరు ప్రకారం ముహూర్తాలను పెట్టుకున్నారు. శుక్రవారం, శనివారం ఎక్కువ మంది నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంది. కాగా కలెక్టరేట్లో నిశాంత్కుమార్, సీతంపేట ఐటీడీఏలో పాలకొండ ఆర్వో కల్పనాకుమారి, సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో ఆయా ఆర్వోలు సి.విష్ణుచరణ్, హేమలత, వెంకటరమణ ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేశారు. నోటిఫికేషన్ వివరాలను రిటర్నింగ్ కార్యాలయ నోటీసు బోర్డులో పెట్టారు.