Share News

కూటమితోనే రాష్ట్రాభివృద్ధి

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:25 AM

కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వరి అన్నారు.

కూటమితోనే రాష్ట్రాభివృద్ధి

గరుగుబిల్లి: కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వరి అన్నారు. గురువారం సాయంత్రం బీవీపురం గ్రామంలో రాష్ట్ర బీసీ విభాగం కార్యదర్శి మర్రాపు పురుషో త్తంనాయుడు అధ్యక్షతన జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా జగదీశ్వరి మాట్లాడుతూ రాను న్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రతినిధి ఎం.తవిటినాయుడు, ద్వారపురెడ్డి సత్యనారాయణ, పి.వెంకటనాయుడు, ఎల్‌.గోపాలం, బి.జగదీష్‌, ఎం.రామారావు, కె.బలరాంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 12:25 AM