Share News

రాక్షస పాలన అంతం కావాలి

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:30 AM

గత ఐదేళ్లుగా రాష్ట్రంలో నడుస్తున్న రాక్షస పాలనకు చరమ గీతం పాడాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు పిలుపుని చ్చారు.

రాక్షస పాలన అంతం కావాలి

చీపురుపల్లి: గత ఐదేళ్లుగా రాష్ట్రంలో నడుస్తున్న రాక్షస పాలనకు చరమ గీతం పాడాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు పిలుపుని చ్చారు. గురువారం చీపురుపల్లి వచ్చిన ఆయన రౌతు కామునాయుడు నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. అనంతరం దన్నాన రామచంద్రుడు, గద్దే బాబూరావు, కుచ్చర్లపాటి త్రిమూర్తులరాజును వారి నివాసాల్లో కలిశారు. కరణం మురళీమోహనరావు, పేరిపి మాజీ సర్పంచ్‌ ఎలకల అప్పారావునాయుడు, కోడూరు మాజీ ఎంపీటీసీ రవి తదితరులు కళా సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన వెంట కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు, జనసేన ఇన్‌చార్జి విసినిగిరి శ్రీనివాసరావు, నాలుగు మండలాల పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 12:30 AM