చెట్టును ఢీకొన్న కారు
ABN , Publish Date - Mar 04 , 2024 | 12:17 AM
మండల పరిధిలోని కొట్టక్కి ఎరుకుల పాకల వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి గాయాలైనట్టు ఎస్ఐ జ్ఞానప్రసాద్ తెలిపారు. సాలూరు బంగారమ్మ కాలనీకి చెందిన తాడుతూరి శ్రీను(45) ట్యాక్సీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు
రామభద్రపురం, మార్చి 3: మండల పరిధిలోని కొట్టక్కి ఎరుకుల పాకల వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి గాయాలైనట్టు ఎస్ఐ జ్ఞానప్రసాద్ తెలిపారు. సాలూరు బంగారమ్మ కాలనీకి చెందిన తాడుతూరి శ్రీను(45) ట్యాక్సీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బుకింగ్ నిమిత్తం ట్యాక్సిపై విశాఖపట్టణం వెళుతుండగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో శ్రీను అక్కడికక్కడే మృతిచెందగా కారులో ఉన్న రవికుమార్కు గాయాలయ్యాయి. మృతదేహాన్ని బాడంగి సీహెచ్సీకి తరలించి ఎస్ఐ జ్ఞానప్రసాద్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.