Share News

వైసీపీ పతనం ప్రారంభం

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:13 AM

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంప క్రిష్ణ అన్నారు.

వైసీపీ పతనం ప్రారంభం

శృంగవరపుకోట రూరల్‌: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంప క్రిష్ణ అన్నారు. గురువారం వివిధ గ్రామాల్లో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ప్రజలను కలుసుకొని ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను వివరించారు. నాలుగున్నరేళ్లలో సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేసిన విధానం, ధరల పెంపు, ఏటా ఉద్యోగాల పేరుతో యువతకు చేసిన మోసాలను వివరించారు. పొలాల్లో పనిచేస్తున్న మహిళలను కలిసి టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పఽథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రాయవరపు చంద్రశేఖర్‌, జుత్తాడ రామసత్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 12:13 AM