రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు
ABN , Publish Date - Mar 11 , 2024 | 12:16 AM
రాష్ట్ర ప్రయోజనాలకోసం టీడీపీ, జనసేన,బీజేపీలతో పొత్తుకు సిద్ధమయ్యిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడినాగార్జున అన్నారు.
![రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చీపురుపల్లి: రాష్ట్ర ప్రయోజనాలకోసం టీడీపీ, జనసేన,బీజేపీలతో పొత్తుకు సిద్ధమయ్యిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడినాగార్జున అన్నారు. ఆదివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. బీజేపీ సహకారంతో రాష్ట్ర సత్వర అభివృద్ధి సాధ్య మవుతుందన్నారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పూర్తి, ఇతర అభివృద్ధి పనులకు కేంద్రంలోని బీజేపీ సహకారం అవసరమని గుర్తించి ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నట్టు తెలిపారు. మూడు పార్టీల పొత్తుతో వైసీపీలో వణుకు మొదలయ్యిందన్నారు.