Share News

ముగిసిన టెన్త్‌ పరీక్షలు

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:01 AM

జిల్లాలో ఈ నెల 18 నుంచి జరుగుతున్న పదో తరగతి పరీక్షలు బుధవారంతో ముగిశాయి. మొత్తంగా 66 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించారు.

 ముగిసిన టెన్త్‌ పరీక్షలు
సాలూరులో పరీక్ష కేంద్రం బయట విద్యార్థులు ఇలా..

సాలూరు రూరల్‌, మార్చి 27: జిల్లాలో ఈ నెల 18 నుంచి జరుగుతున్న పదో తరగతి పరీక్షలు బుధవారంతో ముగిశాయి. మొత్తంగా 66 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించారు. దాదాపు 10,686 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 10,578 మంది పరీక్ష రాశారు. రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకూ పరీక్ష నిర్వహించారు. చివరి రోజున సాంఘికశాస్త్రం పరీక్ష జరిగింది. కాగా పరీక్షలన్నీ ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షల్లో పారదర్శకత కోసం ఫ్లయింగ్‌ స్క్వాడ్లు సంచరించాయి. సిట్టింగ్‌ స్క్వాడ్లు సీ కేంద్రాలను పర్యవేక్షించాయి. జిల్లాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. కాగా పరీక్షలు ముగియడంతో విద్యార్థుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. వారి ముఖాలు మెరిసిపోతూ కనిపించాయి. కేంద్రాల నుంచి ఎంతో ఉత్సాహంగా వారు బయటకు వచ్చారు. మండుటెండను కూడా లెక్కచేయకుండా స్నేహితులందరితో ముచ్చటించారు. పరీక్ష కేంద్రాల బయట కాసేపు సందడి చేశారు.

Updated Date - Mar 28 , 2024 | 12:01 AM