Share News

వలంటీర్లకు తాయిలాలు

ABN , Publish Date - Mar 16 , 2024 | 11:34 PM

అధికార పార్టీ నాయకులు తాయిలాలతో వలంటీర్లకు ఎర వేస్తున్నారు. నగదు, దుస్తులు పంపిణీ చేస్తూ.. వచ్చే ఎన్నికల్లో తమకు సహక రించాలని కోరుతున్నారు

 వలంటీర్లకు తాయిలాలు
కల్యాణ మండపం నుంచి తాయిలాలతో బయటకు వస్తున్న వలంటీర్లు

పాలకొండ: అధికార పార్టీ నాయకులు తాయిలాలతో వలంటీర్లకు ఎర వేస్తున్నారు. నగదు, దుస్తులు పంపిణీ చేస్తూ.. వచ్చే ఎన్నికల్లో తమకు సహక రించాలని కోరుతున్నారు. శనివారం పాలకొండ-రాజాం రోడ్డులోని అన్నవరం సమీపంలోని ఓ కల్యాణ మండపంలో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ ఆధ్వర్యంలో ఈ పంపిణీ చేపట్టినట్లు తెలిసింది. పాలకొండ మండలంతో పాటు పట్టణంలోని ఎంపిక చేసిన వలంటీర్లను పిలిచి రూ.ఐదు వేలతో పాటు వారికి దుస్తులను అందజేశారు. వైసీపీ విశ్వాసపాత్రులను గుర్తించి వారికి ఈ తాయిలాలు ఇచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉండగా కల్యాణ మండ పంలోకి వలంటీర్లు మొబైల్‌ ఫోన్లు తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ తాయిలాల పంపిణీ కార్యక్రమంలో వలంటీర్లతో పాటు పలువురు సర్పంచ్‌లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2024 | 11:34 PM