ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్
ABN , Publish Date - Apr 08 , 2024 | 11:52 PM
కురుపాం నియోజకవర్గం అల్లువాడలో వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ పరమేశ్ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ నిశాంత్కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
![ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
పార్వతీపురం, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): కురుపాం నియోజకవర్గం అల్లువాడలో వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ పరమేశ్ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ నిశాంత్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కొమరాడ మండలం పెద్దశాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ గాపనిచేస్తున్న పరమేశ్ రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్టు ఆధారాలతో సహా ‘ఆంధ్రజ్యోతి’లో ఇటీవల వార్త వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అధికార య్రంతాంగం విచారణ చేపట్టింది. పరమేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వాస్తవమేనని గుర్తించి ఆయన్ని సస్పెండ్ చేసింది.