Share News

పురుగు మందు తాగి ఆత్మహత్య

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:12 AM

మండలంలో సోంపురం కూడలికి దగ్గరలో ఒక వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్‌ఐ గోపాలరావు తెలిపారు.

పురుగు మందు తాగి ఆత్మహత్య

లక్కవరపుకోట: మండలంలో సోంపురం కూడలికి దగ్గరలో ఒక వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్‌ఐ గోపాలరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తవలస చింతల దిమ్మకు చెందిన పాకలపాటి శ్రీనివాసరాజు(47)పై కొద్దిరోజుల కిందట బాలికపై అత్యాచార ఘటనలో పోక్సో కేసు నమోదైంది. దీంతో పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్న శ్రీనివాసరాజు గురువారం సోంపురం కూడలికి దగ్గరలో శవమై కనిపించాడు. పొలంపని చేసుకుంటున్న రైతుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోక్సో కేసు నమోదైందన్న కారణంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతు ని తల్లి పార్వతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Apr 19 , 2024 | 12:12 AM