చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి
ABN , Publish Date - Apr 30 , 2024 | 12:29 AM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కూటమి అభ్యర్థి బోనెల విజయచంద్ర అన్నారు.
సీతానగరం: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కూటమి అభ్యర్థి బోనెల విజయచంద్ర అన్నారు. మండలంలోని కామంద్రవలస, పాపమ్మవలస, గుచ్చిమి గ్రామాల్లో టీడీపీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సత్యంనాయుడు, గోపాల్నాయుడు ఆధ్వర్యంలో ఆయన సోమవారం ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార ్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జి లక్ష్మణరావు, బుడితి గోపాలకృష్ణ, మరడాన గౌరునాయుడు బూరాడ చిరంజీవి, మరిశర్ల సంజీవినాయు డు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: జిల్లా కేంద్రంలో కూటమి అభ్యర్థి బోనెల విజయచంద్ర సోమవారం ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా తనకు సైకిల్ గుర్తుపై, ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీతకు కమలం గుర్తుపై ఓటు వేసి, గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు ద్వారపురెడ్డి శ్రీదేవి, ద్వారపూడి శ్రీనివాసరావు, విజయచంద్ర సతీమణి అనూష, తేజోవతి, వెంకటనాయుడు, బార్నాల సీతారాం, కోల మధు, కృష్ణమోహన్ , గౌరునాయుడు, గొట్టా శివ, జొన్నాడ శ్రీదేవి, కొత్తకోట ప్రసాద్, చందక అనీల్, ఆగూరు మణి, గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్: పట్టణంలో నవ్విరి కాలనీకి చెందిన సుమారు వంద కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరాయి. వీరిని కూటమి అభ్యర్థి బోనెల విజయచంద్ర పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ సీనియర్ నాయకు డు మజ్జి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆరో వార్డుకు చెంది మజ్జి భాను ప్రకాష్ నాయకత్వంలో వీరంతా పార్టీలో చేరారు. కూటమి నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, ఎం.కృష్ణమోహన్, పారిశర్ల అప్పారావు, శివ తదితరు లు పాల్గొన్నారు.