Share News

మద్యం సీసాల స్వాధీనం

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:33 AM

జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో అక్ర మంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి 113 మద్యం సీసా లను స్వాధీనం చేసుకున్నట్టు వన్‌టౌన్‌ సీఐ వెంకటరావు తెలిపారు

మద్యం సీసాల స్వాధీనం

విజయనగరం క్రైం: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో అక్ర మంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి 113 మద్యం సీసా లను స్వాధీనం చేసుకున్నట్టు వన్‌టౌన్‌ సీఐ వెంకటరావు తెలిపారు. వన్‌టౌన్‌ ఎస్‌ఐ నవీన్‌ పడాల్‌, టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ సాగర్‌బాబులు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో వల పన్ని నిందితులను పట్టుకున్నారని చెప్పారు.

రేగిడి: మండలంలోని అక్కన్నఅగ్రహారానికి చెందిన ఓ వ్యక్తి నుంచి 18 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు. మంగళవారం ఎన్నికల సోదాల్లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో ఉంగరాడమెట్టసెంటర్‌ నుంచి బెల్ట్‌ షాపునకు మద్యం తరలిస్తుండగా పట్టుకుని అరెస్టుచేసినట్లు చెప్పారు.

Updated Date - Mar 27 , 2024 | 12:33 AM