గుండెపోటుతో సచివాలయ ఉద్యోగి మృతి
ABN , Publish Date - Mar 27 , 2024 | 12:29 AM
సచివాలయ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి కు టుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలం లోని ఉద్దవోలుకు చెందిన ఉప్పాడ శ్రీకాంత్(29) సుందరాడ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. రోజూ మధ్యాహ్నం భోజన విరామ సమయంలో సచివాల యం నుంచి ఉద్దవోలులోని తన ఇంటికి వెళ్లి భోజనం చేసి వ స్తుంటాడు. ఎప్పటిలాగే మంగళవారం కూడా సచివాలయం నుంచి తన తండ్రి రామారావును బైక్ పై ఎక్కించుకుని భోజ నం కోసం ఇంటికి బయలుదేరాడు.
![గుండెపోటుతో సచివాలయ ఉద్యోగి మృతి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
తెర్లాం: సచివాలయ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి కు టుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలం లోని ఉద్దవోలుకు చెందిన ఉప్పాడ శ్రీకాంత్(29) సుందరాడ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. రోజూ మధ్యాహ్నం భోజన విరామ సమయంలో సచివాల యం నుంచి ఉద్దవోలులోని తన ఇంటికి వెళ్లి భోజనం చేసి వ స్తుంటాడు. ఎప్పటిలాగే మంగళవారం కూడా సచివాలయం నుంచి తన తండ్రి రామారావును బైక్ పై ఎక్కించుకుని భోజ నం కోసం ఇంటికి బయలుదేరాడు. అలా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తున్న స మయంలో మార్గమధ్యలో ఒక్కసారిగా శ్రీకాంత్కు గుండెనొప్పి రావడంతో అక్క డిక్కడే బండిపై నుంచి పడిపోయాడు. తన కళ్లముందే కోడుకు నేలకొరగడంతో తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. కొడుకును స్థానికుల సహాయంతో రాజాం లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించాడు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు ధ్రువీకరించారు. శ్రీకాంత్ మృతి పట్ల తోటి సచివాలయం ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు. బొబ్బిలి నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బేబీనాయన, మండల నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.