Share News

రేపటి నుంచి పాఠశాలల పునః ప్రారంభం

ABN , Publish Date - Jun 11 , 2024 | 11:21 PM

వేసవి సెలవులు ముగియడంతో ఈ నెల 13 నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి.

రేపటి నుంచి పాఠశాలల పునః ప్రారంభం

సాలూరు రూరల్‌, జూన్‌ 11: వేసవి సెలవులు ముగియ డంతో ఈ నెల 13 నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. జిల్లాలో పాఠశాలలకు ఏప్రిల్‌ 24 నుంచి వేసవి సెలవులిచ్చారు. తొలుత ఈ సెలవులు ఈ నెల 11 వరకు ఇచ్చారు. నారా చంద్ర బాబునాయుడు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేస్తుండ డంతో సెలవులను మరో రోజు పొడిగించారు. పాఠశాలలు గురువారం తెరుచుకోనున్నాయి. జిల్లాలో 1,744 పాఠశాలలు ఉన్నాయి. ఇప్పటికే మండలాల స్థాయి పాయింట్లకు పాఠ్యపుస్తకాలు సరఫరా అయ్యాయి. విద్యాకానుక ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పంపిణీ చేయనున్నారు.

Updated Date - Jun 11 , 2024 | 11:24 PM