Share News

రోడ్డేది.. కరెంటేది?

ABN , Publish Date - Mar 09 , 2024 | 11:59 PM

తాగునీరు ఇచ్చే కొళాయిలు లేవు.. ఇంటికి.. బయటకు వెళ్లడానికి రహదారి నిర్మించలేదు. ఇంట్లో ఉండేందుకు కరెంటు ఇవ్వలేదు. మనిషి బతకడానికి అవసరమైన సౌకర్యాలేవీ కల్పించకుండా టిడ్కో ఇళ్ల పంపిణీని హడావిడిగా చేపట్టేశారు.

రోడ్డేది.. కరెంటేది?
మట్టికుప్ప మీదుగా ఇళ్లకు వెళ్తున్న టిడ్కో లబ్ధిదారులు

రోడ్డేది.. కరెంటేది?

మౌలిక సదుపాయాలు కల్పించకుండా టిడ్కో గృహాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

తాగునీరు ఇచ్చే కొళాయిలు లేవు.. ఇంటికి.. బయటకు వెళ్లడానికి రహదారి నిర్మించలేదు. ఇంట్లో ఉండేందుకు కరెంటు ఇవ్వలేదు. మనిషి బతకడానికి అవసరమైన సౌకర్యాలేవీ కల్పించకుండా టిడ్కో ఇళ్ల పంపిణీని హడావిడిగా చేపట్టేశారు. ఏళ్ల తరబడి మిన్నకుండి ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేస్తుందేమోనన్న కంగారుతో వెంటవెంటనే లబ్ధిదారులను పిలిచేసి.. సభ పెట్టేసి... ఇళ్లు అప్పగించేసి వెళ్లిపోయారు. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో శనివారం సారిపల్లిలో జరిగిన తంతు ఇది. 1024 మంది లబ్ధిదార్లకు ఇళ్లను పంపిణీ చేసినట్లు ఆయన ప్రకటించారు. కొంత మంది లబ్ధిదార్లకు ఎమ్మెల్యే ఇంటి తాళాలు అందించి ఇళ్లను పూర్తిస్థాయిలో పంపిణీ చేసేశామన్నారు. వాస్తవంగా టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది టీడీపీ ప్రభుత్వం. పనులు కూడా చాలా వరకు పూర్తి చేసేసింది. మిగిలిన కాస్త పనులకు ఈ ప్రభుత్వానికి ఐదేళ్లు కూడా సరిపోలేదు. ఎన్నికల వేళ హడావిడి చేసింది. ప్రస్తుతానికి అవి ఏమాత్రం నివాస యోగ్యం కావు. విద్యుత్‌ లేదు. తాగునీరు సరఫరా చేసే రెండో ట్యాంకు ఇంకా నిర్మాణంలోనే ఉంది. రోడ్లు సక్రమంగా లేవు.

Updated Date - Mar 09 , 2024 | 11:59 PM