Share News

గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:15 AM

బత్తిలిలోని సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ప్రైవేటు బస్సులో ఒడిశా నుంచి ఆంధ్రాకు 12 కేజీల గంజాయిని తరలిస్తున్న మహారా ష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తుల ను గురువారం అదుపులోకి తీసుకున్నట్టు ఎస్‌ఐ సి.హెచ్‌.ప్రసాద్‌ తెలిపారు. దీని విలువ సుమారు రూ.60 వేలు ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.

 గంజాయి స్వాధీనం

భామిని: బత్తిలిలోని సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ప్రైవేటు బస్సులో ఒడిశా నుంచి ఆంధ్రాకు 12 కేజీల గంజాయిని తరలిస్తున్న మహారా ష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తుల ను గురువారం అదుపులోకి తీసుకున్నట్టు ఎస్‌ఐ సి.హెచ్‌.ప్రసాద్‌ తెలిపారు. దీని విలువ సుమారు రూ.60 వేలు ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.

కొమరాడ: రాష్ట్ర సరిహద్దులో ఉన్న కూనేరు చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా రాయగడ నుంచి పార్వతీపురం వైపు వస్తున్న బస్సులో ఒక వ్యక్తి వద్ద ఐదు కిలోల 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కొమరాడ ఎస్‌ఐ నీల కంఠం తెలిపారు. గంజాయి తరలిస్వున్న అస్సాం రాష్ట్రానికి చెందిన దీపక్‌రాయ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు గురువారం తరలించినట్లు ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - Mar 29 , 2024 | 12:15 AM