Share News

50 ఏళ్లకే పింఛన్‌

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:18 AM

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే పింఛన్‌ మంజూరు చేస్తుందని కోండ్రు మురళిఅన్నారు.

50 ఏళ్లకే పింఛన్‌

రేగిడి: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే పింఛన్‌ మంజూరు చేస్తుందని కోండ్రు మురళిఅన్నారు. గురువారం రాత్రి మండలం కోడిస గ్రామంలో నిర్వహించిన ‘జయహో బీసీ’ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేస్తామన్న డిక్లరేషన్‌ హామీతో రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని కోండ్రు అన్నారు. సీఎం జగన్‌రెడ్డి బీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి నిధులు ఇవ్వకుండా 56 కార్పొరేషన్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు కిమిడి అశోక్‌కుమార్‌, దూబ ధర్మారావు, గురవాన రమేష్‌, గురవాన నారాయ ణరావు, మజ్జి శ్రీను, దుప్పలపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:18 AM