Share News

మా సమస్యలు పరిష్కరించాల్సిందే

ABN , Publish Date - Feb 15 , 2024 | 11:51 PM

తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సిందేనని ఏపీ ఎన్‌జీవో సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు.

 మా సమస్యలు పరిష్కరించాల్సిందే
జిల్లా ట్రెజరీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న ఎన్‌జీవో సంఘ నాయకులు

- సబ్‌ ట్రెజరీ కార్యాలయం వద్ద ఎన్‌జీవోల ఆందోళన

పార్వతీపురం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సిందేనని ఏపీ ఎన్‌జీవో సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. జేఏసీ పిలుపు మేరకు గురువారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఎన్‌జీవో సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. పార్వతీపురంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘ నాయకుడు జీవీఆర్‌ఎస్‌ కిషోర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. డీఏ, ఏపీజీఎల్‌ఐ, సరెండర్‌ లీవుల బకాయిలు, పీఆర్సీ ఏరియర్స్‌ చెల్లించాలని, సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ ఎన్‌జీవో సంఘ నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 11:51 PM