ఓపీఎస్ పునరుద్ధరించాల్సిందే..
ABN , Publish Date - Jan 28 , 2024 | 12:00 AM
పాత పింఛను విధానాన్ని సర్కారు పునరుద్ధరించాలని ఏపీసీపీఎస్ఈఏ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా వచ్చేనెల 4న విశాఖలో నిర్వహించనున్న సాగర సంగ్రామ దీక్షకు ప్రతిఒక్కరూ తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.
![ఓపీఎస్ పునరుద్ధరించాల్సిందే..](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సాగర సంగ్రామ దీక్షకు తరలిరావాలిని పిలుపు
పాలకొండ: పాత పింఛను విధానాన్ని సర్కారు పునరుద్ధరించాలని ఏపీసీపీఎస్ఈఏ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా వచ్చేనెల 4న విశాఖలో నిర్వహించనున్న సాగర సంగ్రామ దీక్షకు ప్రతిఒక్కరూ తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. శనివారం పాలకొండలో దీక్ష సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పిన సీఎం జగన్ మాట తప్పి.. మడం తిప్పారని విమర్శించారు. ఇందుకు నిరసనగా విశాఖలో చేపట్టే దీక్షకు భారీగా సీపీఎస్ సభ్యులు హాజరై.. విజయవంతం చేయాలని వారు కోరారు. అనంతరం దీక్ష పోస్టర్లను విడుదల చేశారు. ఈ సమావేశంలో ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సతీష్, జిల్లా ముఖ్య కార్యవర్గ సభ్యుడు చిన్నప్పలనాయుడు, ప్రధాన కార్యదర్శి ఎ.పైడిపునాయుడు తదితరులు పాల్గొన్నారు.