Share News

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

ABN , Publish Date - Apr 07 , 2024 | 12:27 AM

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. దీనికి సంబంధించి ఎస్‌ఐ జ్ఞానప్రసాద్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

రామభద్రపురం: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. దీనికి సంబంధించి ఎస్‌ఐ జ్ఞానప్రసాద్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామానికి చెందిన కాజా వేణుగోపాలస్వామి శుక్రవారం అర్ధరాత్రి బైక్‌పై రామభద్రపురం నుంచి స్వగ్రామమైన మెట్టవలస వెళ్తున్నాడు. గ్లోబల్‌ స్కూల్‌ వద్ద వచ్చేసరికి బైక్‌ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమా దంలో ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయాలవ్వడంతో విజయనగరం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నాడని, దీనిపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Apr 07 , 2024 | 12:27 AM