Share News

నామినేషన్ల షురూ..

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:52 AM

చీపురుపల్లి అసెంబ్లీ స్థానానికి కూటమి తరపున పోటీ చేస్తున్న కిమిడి కళావెంకటరావు బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌ మల్లిక్‌నాయుడు, పార్టీ నాయకులు కుచ్చర్లపాటి త్రిమూర్తులరాజు, గద్దే బాబూరావు, రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు వెంటరాగా ఆర్వోకు నామినేషన్‌ పత్రాన్ని అందజేశారు.

నామినేషన్ల షురూ..
నామినేషన్‌ వేస్తున్న కళావెంకటరావు, కోళ్ల లలితకుమారి

నామినేషన్ల షురూ..

చీపురుపల్లి/ శృంగవరపుకోట, ఏప్రిల్‌ 24: చీపురుపల్లి అసెంబ్లీ స్థానానికి కూటమి తరపున పోటీ చేస్తున్న కిమిడి కళావెంకటరావు బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌ మల్లిక్‌నాయుడు, పార్టీ నాయకులు కుచ్చర్లపాటి త్రిమూర్తులరాజు, గద్దే బాబూరావు, రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు వెంటరాగా ఆర్వోకు నామినేషన్‌ పత్రాన్ని అందజేశారు. తనకు రూ.6,74,57,961ల స్థిర, చర ఆస్తులున్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. భార్య పేరు మీద రూ.21,49,07,622లు ఉన్నట్టు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఒకటి, విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీస్‌ స్టేషన్‌లో ఒక కేసు నమోదై ఉన్నట్టు పేర్కొన్నారు.

ఎస్‌.కోట నుంచి లలితకుమారి

శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోళ్ల లలితకుమారి బుధవారం ఆర్‌వో మురళీకృష్ణకు నామినేషన్‌ పత్రాలు అందజేశారు. డమ్మీగా ఆమె తల్లి గొంప సత్యవతి నామినేషన్‌ వేశారు. లలితకుమారి వెంట టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఇందుకూరి సుధారాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బుచ్చి అప్పలరామప్రసాద్‌, జనసేన నియోజకవర్గ సమన్వయ కర్త ఒబ్బిన సత్యనారాయణ ఉన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:52 AM