మిమ్స్ ఉద్యోగుల నిరసన
ABN , Publish Date - Mar 26 , 2024 | 12:02 AM
మిమ్స్ ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నెల్లిమర్లలో సోమవారం ర్యాలీ నిర్వహించారు.
![మిమ్స్ ఉద్యోగుల నిరసన](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నెల్లిమర్ల: మిమ్స్ ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నెల్లిమర్లలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం మిమ్స్ కళాశాల ప్రధాన గేటు సమీపంలో రోడ్డుపై బైఠాయించారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ గత 54 రోజులుగా వీరు నిరసన దీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం నిరసన దీక్ష శిబిరం నుంచి ర్యాలీగా వెళ్లి విజయనగరం-చీపురుపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించారు. బకాయి డీఏలు చెల్లించాలని.. సస్పెండైన ఉద్యోగులను విధుల్లో చేర్చుకోవాలని తదితర డిమాండ్లు చేశారు. సీఐటీయూ అనుబంధ వర్కర్స్ యూనియన్ నాయకుడు సురేష్, కిల్లంపల్లి రామారావు, మిమ్స్ ఉద్యోగ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.