Share News

టీడీపీలో భారీ చేరికలు

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:18 AM

పార్వతీపురం పట్టణంలో 18 వార్డుకు చెందిన గొట్ట శివకేశ్వరరావు, చనమల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు గురువారం టీడీపీలో చేరాయి.

టీడీపీలో భారీ చేరికలు

పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: పార్వతీపురం పట్టణంలో 18 వార్డుకు చెందిన గొట్ట శివకేశ్వరరావు, చనమల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు గురువారం టీడీపీలో చేరాయి. వారికి కూటమి అభ్యర్థి విజయచంద్ర పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చీకటి భద్రినారాయణ పాల్గొన్నారు. అదేవిధంగా 29వ వార్డు టీడీపీ నాయకుడు బత్తుల నారాయణరావు ఆధ్వర్యంలో 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ కార్యక్రమంలో పార్వతీపురం పట్టణానికి చెందిన కూటమి నాయకులు సింగ్‌మజ్జి కృష్ణమోహన్‌, నారాయణరావు, టీవీ రమణ, ఎం.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పార్వతీపురం రూరల్‌: పార్వతీపురం మండలంలో వైసీపీకి గట్టి షాక్‌ తగులు తూనే ఉంది. ఈనెల 17న మండలంలోని ఎంఆర్‌నగరం సర్పంచ్‌ వంగపండు లక్ష్మీతో పాటు ఉపసర్పంచ్‌ త్రినాథ్‌నాయుడు వారి అనుచరులతో టీడీపీలో చేరారు. తాజాగా సూడిగాం గ్రామ సర్పంచ్‌ పి.సూర్యనారాయణ తన అనుచరులతో టీడీపీ లో చేరారు. వీరిని కూటమి అభ్యర్థి విజయచంద్ర పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే లక్ష్మీనారాయణపురానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు ధనుంజయనాయుడు తన అనుచరులతో టీడీపీలో చేరారు.

Updated Date - Apr 19 , 2024 | 12:18 AM