టీడీపీలో భారీ చేరికలు
ABN , Publish Date - Apr 05 , 2024 | 12:31 AM
దత్తి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బోడసింగి సత్తిబాబు ఆధ్వర్యంలో సుమారు 200 కుటుంబాలు గురువారం టీడీపీలో చేరాయి.
![టీడీపీలో భారీ చేరికలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
దత్తిరాజేరు/విజయనగరం(ఆంధ్రజోతి): దత్తి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బోడసింగి సత్తిబాబు ఆధ్వర్యంలో సుమారు 200 కుటుంబాలు గురువారం టీడీపీలో చేరాయి. వీరంతా విజయనగరంలో గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ క్యాంపు కార్యా లయంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని శ్రీనివాస్ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ మండల అధ్య క్షుడు చప్ప చంద్రశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ పెద్దింటి మోహన్, ప్రధాన కార్యదర్శి ఎం.ఈశ్వరరావు, క్లస్టర్ ఇన్చార్జిలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
గజపతినగరంలో టీడీపీ జెండా ఎగరేద్దాం
గంట్యాడ: గజపతినగరం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగుర వేయాలని కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం గంట్యాడ గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. తమ కుటుంబంపై ఆధరాభి మానాలు చూపించాలని కోరారు. మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు, తదితరులు పాల్గొన్నారు.