జనసేనలోకి భారీ చేరికలు
ABN , Publish Date - Apr 30 , 2024 | 12:27 AM
భామిని మండల కేంద్రంలో జనసేన ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది.
![జనసేనలోకి భారీ చేరికలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
భామిని: భామిని మండల కేంద్రంలో జనసేన ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. భామినిలోని వైసీపీ ఎమ్మెల్యే కళావతి అసమ్మతి వర్గం, యువత సోమవారం జనసేన పార్టీలో చేరారు. కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ వారికి కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. 25 మంది యువత చేరగా, భామిని ఎంపీటీసీ బిడ్డిక తులసి, నాగేశ్వరరావు, లోపింటి జయరాజు, శంకర్తో పాటు 35 మంది, బొడ్డగూడ సర్పంచ్ బిడ్డిక మారతమ్మ, భర్త అనంత, వెంకన్నతో పాటు బొడ్డగూడ, సవరపాడు, బూర్జిగూడకు చెందిన 75 మంది చేరారు. అలాగే నులకజోడుకు చెందిన కోలక ఆఫీసుతో పాటు ఐదు కుటుంబాలు చేరాయి. ఈసందర్భంగా జయకృష్ణ మాట్లాడుతూ తనకు సహకరించిన ప్రతి ఒక్కరిని గౌరవిస్తామన్నారు. భామిని మండలాన్ని అభివృద్ధి చేసేందుకు పాటుపడతానని హామీ ఇచ్చారు. అనంతరం గజపతినగరం, అనంతగిరి, మణిగ, బొడ్డగూడ, సవరపాడు, బూర్జిగూడ గ్రామాల్లో జయకృష్ణ ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
జయకృష్ణకు మద్దతుగా..
వీరఘట్టం: కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణను గెలిపించాలని కోరుతూ సోమవారం వీరఘట్టంలోని మందిరం వీధిలో టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో గాజు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కూటమి నాయకులు జామి లక్ష్మీనారాయణ, బల్లా హరి, పప్పల మహేష్, తుమ్మల రమేష్, అచ్యుతరావు, కోటప్పడు, భోగి చం ద్రమౌళి, ప్రవీణ్ పాల్గొన్నారు.
కూటమి అభ్యర్థి జయకృష్ణకు మద్దతుగా కుంబిడి ఇచ్ఛాపురం పంచాయతీలో బల్లగూడ, గంగంపేట, కుంబిడి గ్రామాల్లో ఆ పార్టీ నాయకులు సోమవారం ప్రచారం చేశారు. కూటమి నాయకులు ఉదయన ఉదయ్భాస్కర్, నిమ్మక పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.