వైసీపీ పాలనకు మంగళం పాడుదాం
ABN , Publish Date - Feb 29 , 2024 | 12:20 AM
రానున్న ఎన్నికల్లో వైసీపీ పాలనకు మంగళం పాడేందుకు ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలని టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి బోనెల విజయచంద్ర కోరారు.
![వైసీపీ పాలనకు మంగళం పాడుదాం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
పార్వతీపురం రూరల్: రానున్న ఎన్నికల్లో వైసీపీ పాలనకు మంగళం పాడేందుకు ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలని టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి బోనెల విజయచంద్ర కోరారు. బుధవారం పెద్దబొండపల్లిలో వివిధ సామాజిక వర్గాల పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామంలో పర్యటించారు. టీడీపీ-జనసేనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బోను దేవి చంద్రమౌళి, నాయకులు చిన్న రామ్మూర్తినాయుడు, సవరపు గాంధీ, చుక్క అచ్యుత, గొట్టాపు వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీతోనే బీసీల అభివృద్ధి
సీతానగరం: టీడీపీతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర అన్నారు. తుమరాడ గ్రామం లో టీడీపీ అధ్యక్షుడు పెంకి వేణుగోపాల్నాయుడు, బీసీ సెల్ అధ్యక్షుడు బూరాడ రామ్మోహన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహిం చిన జయహో బీసీ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ జగదీష్ పాల్గొని, మాట్లాడారు. బీసీల అభివృద్ధే టీడీపీ ధ్యేయం అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.