Share News

నిరంకుశ ధోరణిని విడనాడాలి

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:22 AM

నెల్లిమర్ల మిమ్స్‌ ఉద్యోగులు తమ న్యాయ మైన సమస్యలు పరిష్కరించాలని కోరితే, యాజమాన్యం నిరంకుశ ధోరణి అవలంభిస్తూ కేసులు నమోదు చేసి జైలుకు పంపడం హేయమైన చర్య అని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ అన్నారు.

 నిరంకుశ ధోరణిని విడనాడాలి

విజయనగరం దాసన్నపేట: నెల్లిమర్ల మిమ్స్‌ ఉద్యోగులు తమ న్యాయ మైన సమస్యలు పరిష్కరించాలని కోరితే, యాజమాన్యం నిరంకుశ ధోరణి అవలంభిస్తూ కేసులు నమోదు చేసి జైలుకు పంపడం హేయమైన చర్య అని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ అన్నారు. యాజమాన్యం కారణంగా ఇటీవల జైలుకి వెళ్లి బెయిల్‌పై వచ్చిన ఈశ్వరమ్మ, లక్ష్మి, రమణ, రాజశేఖర్‌లకు కలెక్టరేట్‌ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాజమాన్యం, అధికార యంత్రాంగం, పోలీసు వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తప్పు యాజమాన్యం చేస్తే కార్మికులను.. అందులో మహిళలను నిర్బంధించడం జిల్లా ప్రతిష్టను దిగజార్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ, యూనియన్‌ ప్రతినిధులు జగన్మోహన్‌రావు, మిరపా నారాయణరావు, కిల్లంపల్లి రామారావు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2024 | 12:22 AM