కేజీ బంగారం పట్టివేత
ABN , Publish Date - Apr 12 , 2024 | 12:00 AM
ఓ కారులో తరలిస్తున్న కేజీ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
![కేజీ బంగారం పట్టివేత](https://media.andhrajyothy.com/media/2024/20240407/11_plkp_2_1816ca56dd.gif)
పాలకొండ, ఏప్రిల్ 11: ఓ కారులో తరలిస్తున్న కేజీ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల దృష్ట్యా పట్టణంలోని గాయత్రీ దేవి ఆలయ సమీపంలోని చెక్పోస్టు వద్ద పోలీసులు, ప్రత్యేక బలగాలు గురువారం వాహన తనిఖీలు చేపట్టాయి. ఒడిశా రాష్ట్రం రాయగడ నుంచి శ్రీకాకుళం వెళుతున్న కారుని ఆపి తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న సుమారు కేజీ బంగారం పట్టుబడింది. ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకుని తొలుత పాలకొండ ట్రెజరీకి, అనంతరం పార్వతీపురం ట్రెజరీకి తరలించారు.