టెన్త్ ఇన్విజిలేటర్ల జంబ్లింగ్
ABN , Publish Date - Mar 22 , 2024 | 12:12 AM
పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ చేస్తున్నారు. జిల్లాలో 66 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. వాటిల్లో 22 సీ సెంటర్లు ఉన్నాయి. కాగా ఈ పరీక్షల నిర్వహణకు తొలి విడతగా 518 మంది ఇన్విజిలేటర్లును నియమించారు. అయితే ప్రస్తుతం వెనక్కి పిలిచి.. కొత్తవారిని ఆయా కేంద్రాల్లో నియమిస్తున్నారు.
![టెన్త్ ఇన్విజిలేటర్ల జంబ్లింగ్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సాలూరు రూరల్,మార్చి 21: పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ చేస్తున్నారు. జిల్లాలో 66 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. వాటిల్లో 22 సీ సెంటర్లు ఉన్నాయి. కాగా ఈ పరీక్షల నిర్వహణకు తొలి విడతగా 518 మంది ఇన్విజిలేటర్లును నియమించారు. అయితే ప్రస్తుతం వెనక్కి పిలిచి.. కొత్తవారిని ఆయా కేంద్రాల్లో నియమిస్తున్నారు. ఈ నెల 23 నుంచి జరిగే సైన్స్, సోషల్ పరీక్షలను కొత్త ఇన్విజిలేటర్లుతో నిర్వహించనున్నారు. రెండో విడత ఇన్విజిలేటర్లకు గురువారం మండలాల్లో సీఎంఆర్టీలు ఆర్డర్లు పంపిణీ చేశారు. తొలి విడత నియమించిన ఇన్విజిలేటర్లు గణిత పరీక్ష అనంతరం వారి పాఠశాలల్లో విధులకు వెళ్లనున్నారు.