టీడీపీలో చేరికలు
ABN , Publish Date - Apr 18 , 2024 | 12:26 AM
ఎంఆర్నగరం సర్పంచ్ వి.లక్ష్మి, ఉపసర్పంచ్ వంగపండు త్రినాథ్నాయుడు తన అనుచరులతో బుధవారం టీడీపీలో చేరారు.
పార్వతీపురం రూరల్: ఎంఆర్నగరం సర్పంచ్ వి.లక్ష్మి, ఉపసర్పంచ్ వంగపండు త్రినాథ్నాయుడు తన అనుచరులతో బుధవారం టీడీపీలో చేరారు. టీడీపీ మండల అధ్యక్షుడు బోనుదేవి చంద్రమౌళి ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థి బోనెల విజయచంద్ర వీరిని పార్టీలోకి ఆహ్వానించారు. సుమారు 300 కుటుంబాలు టీడీపీలో చేరడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పార్టీ నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, గురజాన చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: సీతానగరం బూర్జ గ్రామంలో మాజీ సర్పంచ్ నీరస జ్యోతి, సత్యనారాయణ, బలరాం ఆధ్వర్యంలో వైసీపీ నుంచి వంద కుటుంబాలు టీడీపీలో చేరాయి. టీడీపీ మండల అధ్యక్షుడు పెంట సత్యం, ప్రధాన కార్యదర్శి వేణు ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థి విజయచంద్ర వీరిని పార్టీలోకి స్వాగతించారు. నాయకులు వెంకటప్పలనాయుడు, పి.నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మండలం డోకిశీల గ్రామంలో కూటమి అభ్యర్థి బోనెల విజయచంద్ర బుధవారం ప్రచారం నిర్వహించారు.