వర్గీకరణతో మాదిగలకు ఉద్యోగాలు
ABN , Publish Date - Feb 25 , 2024 | 12:29 AM
చంద్రబాబు ఎస్సీ వర్గీక రణ చేసిన ఫలితంగా 22 నుంచి 25 వేల మంది మాదిగలు ఉద్యోగాలను సాధించగలిగారని ఎంఆర్పీఎస్ వ్యవ స్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తెలిపారు.శనివారంరాత్రి స్థానిక గంటి ప్రసాదం స్మారకభవనంలో ఏర్పాటు చేసిన మాదిగ, రెల్లిఉపకులాల సమా వేశంలో ఆయన ప్రసంగించారు. 30 ఏళ్లుగా ఆటుపోట్లను ఎదుర్కొంటూ లక్ష్యంకోసం శ్రమిస్తున్న ఎంఆర్పీఎస్కు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఓ టార్చ్లైటు మాదిరిగా వెలుగునిస్తున్నారన్నారు. జీర్ణించుకోలేని కొంతమంది మాల సోదరులు ఢిల్లీలోని ఏపీ భవన్ సాక్షిగా లాబీయింగ్చేసి వర్గీకరణను రద్దుచేయించారన్నారు. వారికి పలుకుబడి, డబ్బు ఉండడంతో సాధించుకోగలి గారన్నారు.సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బోగి శ్రీనివాసరావు, నాయకులు మాసిలామణి, పొందూరు విజయరామారావు, కిల్లా సురేంద్ర, కింతలి రాము,అప్పారావు, రేజేటి బుజ్జి, కాగాన సునీల్కుమార్ పాల్గొన్నారు.
![వర్గీకరణతో మాదిగలకు ఉద్యోగాలు](https://media.andhrajyothy.com/media/2024/20240224/24bblp16_f04e883847.gif)
బొబ్బిలి:చంద్రబాబు ఎస్సీ వర్గీక రణ చేసిన ఫలితంగా 22 నుంచి 25 వేల మంది మాదిగలు ఉద్యోగాలను సాధించగలిగారని ఎంఆర్పీఎస్ వ్యవ స్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తెలిపారు.శనివారంరాత్రి స్థానిక గంటి ప్రసాదం స్మారకభవనంలో ఏర్పాటు చేసిన మాదిగ, రెల్లిఉపకులాల సమా వేశంలో ఆయన ప్రసంగించారు. 30 ఏళ్లుగా ఆటుపోట్లను ఎదుర్కొంటూ లక్ష్యంకోసం శ్రమిస్తున్న ఎంఆర్పీఎస్కు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఓ టార్చ్లైటు మాదిరిగా వెలుగునిస్తున్నారన్నారు. జీర్ణించుకోలేని కొంతమంది మాల సోదరులు ఢిల్లీలోని ఏపీ భవన్ సాక్షిగా లాబీయింగ్చేసి వర్గీకరణను రద్దుచేయించారన్నారు. వారికి పలుకుబడి, డబ్బు ఉండడంతో సాధించుకోగలి గారన్నారు.సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బోగి శ్రీనివాసరావు, నాయకులు మాసిలామణి, పొందూరు విజయరామారావు, కిల్లా సురేంద్ర, కింతలి రాము,అప్పారావు, రేజేటి బుజ్జి, కాగాన సునీల్కుమార్ పాల్గొన్నారు.