Share News

9న దివ్యాంగులకు జాబ్‌మేళా

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:55 PM

పార్వతీపురంలో ఈ నెల 9న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి యు.సాయికుమార్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

9న దివ్యాంగులకు జాబ్‌మేళా

పార్వతీపురం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురంలో ఈ నెల 9న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి యు.సాయికుమార్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి అర్హత కలిగిన దివ్యాంగ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఈ మేళా నిర్వహిస్తున్నామన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు నిరుద్యోగ దివ్యాంగులు ఈ మినీ జాబ్‌మేళాలో పాల్గొనొచ్చని పేర్కొన్నారు. ముందస్తుగా స్కిల్‌యూనివర్స్‌.ఏపీఎస్‌ఎస్‌డీసీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. రిఫరెన్స్‌ నెంబర్‌తో పాటు సదరం సర్టిఫికెట్‌, రెజ్యూమ్‌, ఆధార్‌కార్డు, విద్యార్హత సర్టిఫికెట్ల ఒరిజనల్‌, జిరాక్స్‌ కాపీలు, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలతో హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు 79972 99739 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 11:55 PM