అన్నిరంగాల్లో జగన్ ప్రభుత్వం విఫలం
ABN , Publish Date - May 03 , 2024 | 12:05 AM
సీఎం జగన్ ప్రభుత్వం పాలనలో అన్నిరంగాల్లో విఫలమైందని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి అదితిగజపతిరాజు ఆరోపించారు.గురువారం విజయనగరం కార్పొరేషన్లోని 16వ డివి జన్పరిధిలోని అంబటిసత్తర్వు, అశోక్నగర్, రింగురోడ్డు జంక్షన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
![అన్నిరంగాల్లో జగన్ ప్రభుత్వం విఫలం](https://media.andhrajyothy.com/media/2024/20240428/BJR_0323_9753b50211.gif)
విజయనగరం రూరల్: సీఎం జగన్ ప్రభుత్వం పాలనలో అన్నిరంగాల్లో విఫలమైందని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి అదితిగజపతిరాజు ఆరోపించారు.గురువారం విజయనగరం కార్పొరేషన్లోని 16వ డివి జన్పరిధిలోని అంబటిసత్తర్వు, అశోక్నగర్, రింగురోడ్డు జంక్షన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
టీడీపీలో 500 కుటుంబాల చేరిక
విజయనగరం కార్పొరేషన్లోని మూడోడివిజన్ కార్పొరేటర్ వజ్రపు సత్యగౌరీ, ఆమె భర్త వజ్రపు శ్రీని వాసరావు, జి.రమణ, బర్నాల సంతోష్, దువ్వు శ్రీనుతోపాటు 500 కుటుంబాలు గురువారం టీడీపీలో చేరాయి.ఈ మేరకు స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలోబీసీకాలనీకి చెందిన మజ్జి బాబురావు, పడగల రమణ, మజ్జి రమేష్, మజ్జి శ్రీనివాసరావుతోపాటు, విజయనగరం మండలంలోని బడుకొండపేట ప్రాంతానికి చెందిన పతివాడ శంకరరావు, పతివాడ సత్యం, కర్రోతు రామస్వామితో పాటు 15 కుటుంబాలు టీడీపీలో చేరాయి. రీమా పేట ప్రాంతానికి చెందిన బీఎస్ఎన్ రామరాజుతోపాటు పలువురు చేరారు. ఈ సందర్భంగా అదితి గజపతిరాజు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, ప్రసాదుల ప్రసాద్, ఆల్తి బంగారుబాబు, బొద్దల నర్సింగరావు, గంటా పోలినాయుడు, కంది మురళీనాయుడు,కర్రోతు నర్సింగరావు, పిళ్లా విజయ్కుమార్, గౌరీశంకర్, అవనాపు విజయ్ పాల్గొన్నారు.