నాడు అన్నార్తుల నిలయం.. నేడు వృథా భవనం
ABN , Publish Date - Apr 18 , 2024 | 11:48 PM
ఐదేళ్ల కిందట పేదలకు కడుపు నిండా భోజనం పెట్టి వారి ఆకలి తీర్చే భవనమిది. చౌకగా.. తృప్తిగా.. ఠంచన్గా అన్నం పెట్టేది. కూలీలు, నిరుద్యోగులు, పేదలు, యాచకులతో కళకళలాడేది.
నాడు అన్నార్తుల నిలయం.. నేడు వృథా భవనం
ఐదేళ్ల కిందట పేదలకు కడుపు నిండా భోజనం పెట్టి వారి ఆకలి తీర్చే భవనమిది. చౌకగా.. తృప్తిగా.. ఠంచన్గా అన్నం పెట్టేది. కూలీలు, నిరుద్యోగులు, పేదలు, యాచకులతో కళకళలాడేది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అంతా మారిపోయింది. అన్నంపెట్టే క్యాంటీన్ను అర్ధాంతరంగా మూసేసింది. పేదలకు చౌక భోజనం దూరం చేసింది. ఫలితంగా కళగా ఉండే భవనం వెలవెలబోతోంది. అన్నార్తులు భోజనం చేసిన చోటు అధ్వాన పరిసరాలతో కనిపిస్తోంది.
- విజయనగరం