కూటమి అధికారంలోకి రావడం తఽథ్యం
ABN , Publish Date - Jun 04 , 2024 | 12:10 AM
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం తఽథ్యమని రాజాం నియోజ కవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ తెలిపారు
![కూటమి అధికారంలోకి రావడం తఽథ్యం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
రాజాం: రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం తఽథ్యమని రాజాం నియోజ కవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ తెలిపారు. సోమవారం శ్యాంపురం క్యాంపు కార్యాలయంలో పోలింగ్ ఏజెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లా డారు. మంగళవారం జరిగే కౌంటింగ్లో కూటమి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాల ని సూచించారు. ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలకు సమయానికి చేరుకోవాలని, అధికా రులు ఇచ్చిన నిబంధనలు పాటించేలని కోరారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల నుంచి తీసుకొచ్చే సమ యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, పూర్తిస్థాయిలో ఫలితాలు వచ్చే వరకు ఎవరూ అశ్రద్ధ వహించవద్దని కోరారు. కౌంటింగ్ పూర్త య్యేవరకు ప్రతి ఏజెంట్ కేంద్రంలోనే ఉండాలని తెలిపారు. వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్లో కూట మికి అనుకూలంగా ఫలితాలు రావడం శుభసూచకమని చెప్పారు. దీంతో ప్రస్తుత ప్రభుత్వానికి మింగుడు పడడంలేదన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొళ్ల అప్పలనాయుడు, కోండ్రు జగదీష్, సుమల వెంకట మన్మథరావు, గురవనా నారాయణరావు, గట్టి భాను, కిమిడి అశోక్కుమార్, నంది సూర్యప్రకాష్ రావు, పిన్నింటి మోహన్రావు, దుప్పలపూడి శ్రీనివాసరావు, దూబ ధర్మారావు, వల్లూరి గణేష్ పాల్గొన్నారు.